అర్జున విషాద యోగం: పన్నెండు, పదమూడు మరియు పధ్నాల్గవ శ్లోకములు'
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
తాత్పర్యం
అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.
తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్ ||
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్ ||
తాత్పర్యం
వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.
తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
తాత్పర్యం
అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.
నేపధ్యం:
కౌరవులు తమ వైపు నుంచి యుద్దానికి తమవైపు నుంచి సిద్ధం అన్నట్టు గా అందరికన్నా ముందు కౌరవ సైన్యాధిపతి శంఖం పూరించగా, ఆ వెంబడ మిగిలిన వీరులు కూడా కొందరు శంఖాలు, ఢక్కా, మృదంగం వంటి వాయిద్యాలతో సైన్యానికి ఉత్సాహం కలిగించారు. అది విన్న పాండవ సైన్యం వైపు వీరుల్లో మొట్ట మొదటి వరుస లో ఉండాల్సిన వారు కృష్ణార్జునులు వీరూ తమ శంఖాలని పూరించారు.
కృష్ణార్జునునుల స్నేహం..
తెలుగు వారికి కృష్ణార్జునుల గురించి చెప్పడం అంటే దుస్సాహసమే.. వీరి బాంధవ్యం గురించి అమ్మమ్మల, నాయనమ్మల కథలు వింటూ, పౌరాణిక కథలు చదువుతూ, నాటకాలు చూస్తూ, వేస్తూ, NTR సినిమాలు చూస్తూ, మంచి స్నేహం కల బావా మరుదులని కృష్ణార్జునులతో పోలుస్తూ జీవిస్తున్న జాతి మనది. అయినా.. సాహసం చేసేస్తున్నా..
ఆదిపర్వం లో ధృతరాష్ట్రుడు సంజయునితో, మాట్లాడుతూ ‘ఆ కృష్ణార్జునులు సాక్షాత్తూ నరనారాయణులు అని నారదుడు చెప్పగా విన్నప్పుడే ఈ యుద్ధం లో కౌరవుల గెలుపు అసాధ్యమని నిశ్చయించుకున్నాను.., అంటాడు.
మొదటిసారి కలవడం..
ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు బలరాముడితో కలిసి వస్తాడు. అక్కడ ఆర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపది తో సహా తమకి ఆశ్రయమిచ్చిన కుమ్మరివారింటికి వచ్చేస్తారు. బలరామకృష్ణులు వారి వెనకగా వచ్చి, తమ పరిచయం చేసుకుంటారు. ఆర్జునుడు కృష్ణుని చూడటం అదే మొదటి సారి.
సుభద్ర తో అర్జునుడి పెళ్లి..
ఖాండవ వనాన్ని లో పాండవులు అన్ని రకాలు గా అభివృద్ధి లోకి తెచ్చి, సిరి సంపదలతో తులతూగుతుండగా, ఒకసారి ధర్మరాజు అర్జునుని అడవికి ఏదో ఒక విషయం మీద పంపుతాడు. అలాగ అడవుల్లోకి వెళ్లిన అర్జునుడు పదకొండేళ్లు అక్కడే ఉండిపోతాడు. నాగరాజ్యం లో ఉలూపి ని పెండ్లి చేసుకుని అక్కడ ఒక సంవత్సరం, అలాగే మణిపుర రాకుమారి, చిత్రసేనుని కుమార్తె చిత్రాంగద ని చేసుకుని ఒక మగ బిడ్డని కని అక్కడొక మూడేళ్లు గడిపి, అటూ ఇటూ తిరిగి అప్సరలకి శాప విమోచనం కల్గించి మళ్లీ మణిపురానికి వెళ్లి చిత్రాంగద ని చూసి, సెలవు తీసుకుని చివరకి గోకర్ణం (గోవా దగ్గర ) చేరుకుంటాడు.. అక్కడి నుండీ పడమటి సముద్ర తీరం లో ఉన్న పుణ్య తీర్థాలన్నింటిలో స్నానాలు చేస్తూ, ప్రోభస కి చేరుకుంటాడు.
ఈ విషయం విన్న కృష్ణుడు వెళ్లి అర్జునుని కలిసి ఆప్యాయం గా కౌగలించుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుని ‘ఎందుకయ్యా.. ఈ పుణ్య తీర్థాల చుట్టూ తిరుగు తావు? కొన్నాళ్లు నా దగ్గర ఉందువు గాని రమ్మని’ ద్వారకకి ఆహ్వానించి కొంతకాలం అక్కడే గడిపి అక్కడినుంచి తమ తో పాటూ రైవకత పర్వతం దగ్గరకి తీసుకుని వెళ్తాడు. అక్కడ యాదవులు, ఇంకా అంధక జాతి వారి పండగకి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. జరుగుతోంది. రకరకాల నాటకాలు, నృత్యాలు, గానాలు, వాతావరణం అంతా ఉత్సాహపూర్వకం గా ఉంటుంది. అక్కడ అర్జునుడు తాను పదకొండేళ్లలో చూసిన నదులు, పర్వతాలు తదితర విషయాలన్నీ చెప్పుకుంటాడు. తర్వాత వీరిద్దరూ ద్వారక కి చేరుకుంటారు. అక్కడ కృష్ణుని అతిథి గా చాలా రోజులుండిపోయి మళ్లీ రైవకత పర్వతం మీద జరిగే పెద్ద పండుగ కోసం మళ్లీ చేరతారు. ఆ పండుగ వృష్ణి జాతి వారికీ, అంధక జాతి వారికీ, చాలా ప్రీతికరమైనది. ఉగ్రసేన మహారాజు తో సహా, ఎందఱో యాదవ ప్రముఖులు, సామాన్యులు కొండ కోసం చేసే పండుగ లో పాలు పంచుకోవడానికి ఉత్సాహం గా చేరుకుంటారు. కృష్ణార్జునులు ఒక జట్టు గా తిరుగుతూ సరదాగా గడుపుతుండగా, సర్వాలంకార భూషితురాలై సుభద్ర తన చెలి కత్తేలతో రావడం చూసిన అర్జునుడు సుభద్ర నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. అది కనిపెట్టిన కృష్ణుడు “అర్జునా! ఆ అమ్మాయి నా చెల్లెలు. నీకు తన మీద దృష్టి ఉన్నట్లయితే మా నాన్న తో కావాలంటే మాట్లాడుతాను. చెప్పు’ అని అంటాడు.
దానికి అర్జునుడు “వసుదేవుని కూతురు, కృష్ణుని చెల్లి, ఇంత అందమైన అమ్మాయిని ఎవరు ఆశించరు? సుభద్ర ని పెళ్లాడటానికి నేనేం చేయాలో చెప్పు! చేస్తాను..’ మానవ మాత్రులు చేయగలిగినదేది చేయాలన్నా నేను సిద్ధం గా ఉన్నాను..’ అంటాడు..
కృష్ణుడు చిరునవ్వు నవ్వి “అర్జునా! స్వయంవరం లో భర్తనెన్నుకోవడం క్షత్రియ స్త్రీల పధ్ధతి. అయితే, నా చెల్లి మనసు లో నువ్వున్నావని నేననుకోను.. నా చెల్లి వేరేవారిని వరించే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు బలవంతం గా నా చెల్లిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు” అని ప్రోత్సహించి ధర్మరాజుకి సందేశం పంపుతాడు. ధర్మరాజు ఆ సందేశం చదివి తన సమ్మతి ని తెలియచేస్తాడు. అన్నగారికి సమ్మతమేనని తెలుసుకున్న అర్జునుడు వెంటనే కృష్ణునితో సుభద్ర ని ఎత్తుకుపోయే వ్యూహం పన్ని రైవకత పర్వతం నుండి ద్వారక కి వెళ్లే మార్గం లో కాపు కాస్తాడు. సుభద్ర రైవకత పర్వత రాజుకి పూజ చేసి, పర్వత ప్రదర్శనం కూడా చేసి ద్వారక వైపు వెళ్తుండగా ఆదాట్టున అడ్డగించి తన రథం మీదకి ఎత్తి కూర్చోపెట్టి వేగం గా ఇంద్రప్రస్థం వైపు రథాన్ని తీసుకెళ్తాడు.
సుభద్రాదేవి అంగరక్షకులు నిర్ఘాతపోయి ఒక్క క్షణం దిక్కుతోచక నిలబడి ద్వారక వైపు పరుగు దీసి ఈ వార్తని యాదవ ప్రముఖులకి చేరవేస్తారు. ఆ విషయం తెలుసుకున్న అధికారి డప్పుని కొట్టి అందరికీ అపాయ సూచన ఇస్తాడు. భోజనం చేస్తున్న యాదవులు, అంధకులు, అన్ని వైపులనుండీ తాము చేస్తున్న పని వదిలి ఆయుధాలు పట్టి రథాలకి గుర్రాలని కట్టి కవచాలు ధరించి ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ నిలబడగా,
బలరాముడు దుఃఖంతోనూ, క్రోధం తోనూ, అవమాన భారం తోనూ, ఆ సభ లో “కృష్ణా! ఎందుకు మౌనం గా కూర్చున్నావు? నీగురించే కదా.. ఆ అర్జునికి మన రాజ్యం లో ఆహ్వానమూ, ఆదరమూ లభించాయి? అతను ఈ ఆదరాభిమానాలకి పాత్రుడా? ఆ అథముడికి కి మన మన్నన నందుకునే అర్హత ఉందా? గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన మనిషి ఎవరైనా భోజనం పెట్టిన కంచాన్నే పగలగొడతాడా? మన చెల్లినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నవాడికి మన మర్యాదలు ఒక్క క్షణానికైనా గుర్తురాలేదా? బలవంతం గా చెప్పకుండా తీసుకెళ్లే అవసరం ఏముంది? నా తల మీద కిరీటాన్ని కాలితో తన్నినట్లు అనిపిస్తోంది నాకు. నేను పిరికి గా ఇదంతా భరించాలా? కట్టి వేసిన పాము లాగా బుసలు కొడుతూ ఊరుకోవాలా? నేనొక్కడనే ఈ పాండవులని వెళ్లి ఎదుర్కుంటాను. అర్జునుడిని ఈ విషయం లో ఎప్పటికీ క్షమించలేను’ అని అన్నాడు. దానికి అక్కడున్న భోజులు, వృష్ణులు, అంధకులు అందరూ సంపూర్ణ మద్దతు నిస్తూ హర్ష ధ్వానాలు చేశారు.
అందరి నిరసనలతో సభ మారుమ్రోగుతుండగా, కృష్ణుడు గంభీరం గా “అర్జునుడు మనకి ఏవిధమైన అవమానమూ చేయలేదు. నిజానికి అతని ఈ చర్య వల్ల మన గౌరవం పెరిగింది. మన జాతి డబ్బు కోసం నీతి తప్పే జాతి కాదని అర్జునునికి తెలుసు. స్వయంవరం లో సుభద్ర అతని మెడలో మాల వేస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఒక జంతువుని ఇచ్చినట్లు బహుమానం గా భార్యని తెచ్చుకోవడం అతనికి అవమానకరం. అలాగే కన్యా శుల్కం మనం పుచ్చుకుని పెండ్లి చేయం. ఇవన్నీ ఆలోచించే బలవంతం గా తీసుకెళ్లటం మాత్రమే సరైన పధ్ధతి అని అతను భావించాడు. ఈ పెళ్లి సరైనదే. సుభద్ర, అర్జునుడు ఇద్దరూ ఒకరికి ఒకరు తగిన వారు.
శంతునుడి భరత వంశస్థుడైన అర్జునుడు, కుంతిభోజుని మనవడు! ఒక్క మహేశ్వరుడి తో తప్ప ఎవరితోనూ ఓటమి లేని వాడు, మన స్నేహితుడు కావడం మనకి ఎంత మంచిది? అతని వీరత్వానికి సమానులెవ్వరు? అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరకముందే వెనక్కి తెచ్చి సత్కరించి పెండ్లి చేస్తే మంచిది. లేకపోతే అది మనకి అవమానం.” అన్నాడు.
కృష్ణుని మాటలకి సభ లో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అర్జునుని తెచ్చి పెళ్లి చేశారు. తర్వాత కృష్ణుడు సంవత్సరం పాటూ ద్వారక లోనే ఉండిపోయాడు. కృష్ణార్జునులు మేనత్త మేనమామల పిల్లలూ, స్నేహితులే కాకుండా ఈవిధం గా బావా బావ మరుదులు కూడా అయ్యారు.
నిజం గా కృష్ణుని మాటలు అందరికీ నచ్చాయా?
నాకయితే, బలరాముడి మాటలే న్యాయమనిపించాయి. కృష్ణుని మాటలని తోసిబుచ్చటానికి లేకుండా ఉన్నాయేమో కానీ, సుభద్ర మనసు లో ఏముందో తెలుసుకోకుండా జరిగిన వివాహమే ఇది. ఒక విధం గా బలవంతపు పెళ్లే! కాకపోతే కృష్ణుడు పెద్ద వ్యూహం తో చేసిన పని కాబట్టి..
కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ : THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)
Hmm, interesting information about Subhadra parinayam. It is famously known (for me, through movie I guess) that Subhadra drives the chariot. I did not know that Subhadra might not have chosen Arjuna.
ReplyDeleteAs for Krishna, he has bigger picture in mind than most. So, if he encouraged Arjuna and won the argument that way, it suits his character. Geeta'bharati', I'm looking at this blog of yors thanks to some comments. I'm glad you are making us all think.
Thank Lalita!
DeleteExactly! Shrikrishna had a bigger picture in mind...
నాకూ ఇంతకూ ముందు భారతం చదివినది అక్కడా, ఇక్కడా కలగా పులగం గా అనేక వర్షన్లు చదవడం వల్ల, అలాగే తెలుగు సినిమాల నాలెడ్జ్ తోనే ఇంకోరకం గా అనుకున్నాను. ఈ పార్ట్ లో కృష్ణుని స్పీచ్ యదాతథం గా అందుకే రాశాను.
లలితా,
Deleteకవిత్రయం రాసిన మహా భారతం చూస్తున్నాను. నన్నయ భట్టారకుడు సుభద్రార్జునులు ప్రేమించుకున్నారని, అది తెలిసి కృష్ణుడు మిగిలిన కథ నడిపించినట్లు గా ఉంది. తక్కిన కథ లో పెద్దగా మార్పులు లేవు.
Thanks కృష్ణా.
Deleteనేనూ ఆంగ్ల అనువాదం చదవడం మొదలు పెట్టాను. ఒక మహాకావ్యం అనువాదంగానైనా అసలు చదవడం మొదలు పెట్టేలా చేశావు.ఇప్పుడు వివిధ అనువాదాల్లో తేడాల గురించి కూడా కాస్త తెలుస్తోంది. నన్నయ్య చేసిన అనువాదంలో మార్పులు చేశాడని కొద్దిగా తెలిసింది, ఇలాంటి చర్చల ద్వారానే నాకు. సుభద్రా పరిణయం విషయం తెలియదు. కానీ కొన్ని ఆచారాలు మూలంలో లేనివి ఆయన చేర్చారన్నట్టు చదివాను. ఆ లింకు దొరికితే మళ్ళీ చదువుతాను, ఇక్కడ పంచుకుంటాను.
ఒకప్పుడు ఒకామె, వేరే మతస్థురాలు, దేవుడిని నమ్మే ఆమె, మతంలో ముఖ్య ఆచారాలు పద్ధతిగా పాటించే ఆమె ఒక మాట అన్నారు. "దేవుడు చెప్పారు అని ఏ మాటలు చెప్తున్నారో అవి మనకు చెప్పింది మనుషులే కదా" అని. అందరమూ అన్నీ చదవగలగాలి అని పోరాడి ఆ హక్కుని సంపాదించుకున్న మనం అదే హక్కుని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి, పుస్తకాలూ, గ్రంథాలూ, అందుబాటులో ఉన్నప్పుడైనా చదివి చర్చించుకొని ఆలోచనని పెంచుకుని ఆవేశాలు తగ్గించుకోవాలి అని నా భిప్రాయం. ఐనా కూడా ఒక పట్టాన అర్థం కావేమో, అపార్థం చేసుకుంటామేమో అని జంకడమూ చేస్తాను. ఇలాంటి చర్చల వల్ల కొంతైనా మళ్ళీ అనుకున్న మార్గంలో ముందుకి వెళ్ళగలుగుతుంటాను. So, thanks again.
పైన నా వ్య్యాఖ్యలో నేను చెప్పిన ఆవిడ తన మత పెద్దలని ఉద్దేశించి అన్నారు ఆ మాట. మత గ్రంథం కంటే మత పెద్దల మాట ఎలా పెద్దదౌతుంది అన్న ఉద్దేశ్యంలో అన్నట్టు గుర్తు. అంతే కానీ వేరే మతాల గురించి ఆమె చేసిన వ్యాఖ్య కాదు.
DeleteI support krishna. U r thinking like a normal person like Balram. He has ego. Throughout life Krishna played a role. There is no individual in him. He simply acted based on situaton.
ReplyDeleteకరెక్టే. కాకపోతే సుభద్ర ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకపోవడం, అలాగే అతిథి గా వచ్చి పిల్లనెత్తుకుపోవడం, నాకెందుకో రుచించలేదు.
Deleteఅయితే కృష్ణుడు ఒక పెద్ద ఆలోచనతో ఈవిధం గా చేసి ఉంటాడని మాత్రం ఖచ్చితం గా నమ్ముతాను. మహా భారతం చదివాక నాకు కృష్ణునిమీద 'awe' నాలుగింతలయ్యింది.
Oka pedda alocana
DeleteThat is u r assumption. If Krishna had so many big plans why he died in the hands of hunter?
He just played a role and lived without any ego. It is too difficult to understand him bcs he was so simple and lived naturally
KP,
ReplyDeleteI did not like inteligent/mature person like you writing blog on mahabharat. Lot of people wrote on bharAt . What is new in it. U r wasting time.
Thanks for the comment!
Deleteమహాభారతం నాకు చాలా ఇష్టమైన పుస్తకం.
కొన్నాళ్లు ఈసంవత్సరం కాలు విరిగి మంచం మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎన్నాళ్లనుండో అనుకుంటున్న గీత,మహాభారతాలని చదివాను. ఈమధ్య దేవదత్త పట్నాయక్ రాసిన 'జయ' అన్న పుస్తకాన్ని చదివాక, ఎందుకో చాలా కోణాలు ఇంకా ఆవిష్కరించవచ్చుననిపించింది. నెలకి ఒకటి రెండు సార్లు కొద్ది,కొద్దిగా రాసి చూద్దామని మొదలు పెట్టాను.
మీకు ఇష్టమైతే 20మార్లు చదవండి, ఇలా చెత్త పోస్టులు రాయడం అవసరమా? ఓ సారి చదివిన వెంటనే దానిపై అసంబద్ధమైన పోస్టులు బ్లాగుల్లో బరికేయాలి, నలుగురికి నాకు ఇందులోనూ ప్రవేశముంది అని తెలపాలన్న ఆతురత మంచిది కాదు. మహా భారతం అంతా చదివించుకుని, అందులో తనకు నచ్చిన వాళ్ళు ఓక ముసలోడు(భీష్ముడు), ఓ కుర్రోడు(అభిమన్యు) అన్నాడట, అక్బర్. నాకు మీ మీద వున్న ఇంప్రెషన్ తగ్గింది. అందరికి అన్ని టాలెంట్లు వుండవు, వుండాల్సిన అవ్సరం లేదు. మీ వుత్సాహం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది.
Deleteబలరాముడి వాదనలో స్వయం వరానికి వచ్చి వేచి ఉండిన రాజులముందు పరువు తీసాడని సహజం గా కోపం కనిపిస్తోంది. కృష్ణుడి సమర్ధనలో లౌక్యమ్ మాత్రమె కనిపిస్తుంది. భారతమంతా కృష్ణుడు ఉపయోగించింది ఇదే కదా. కృష్ణుడి కి పెద్దవాళ్ళకి ఉన్నట్లు ముందు ఆలోచన, గమనింపు ఎక్కువ తప్ప పెద్దగా దైవిక శక్తులు ఉపయోగించలేదేమో. అలా కాదంటే చెప్పండి
ReplyDeleteKP గారు,
ReplyDeleteటపా స్పూర్తి, టాపిక్ దగ్గరికొస్తే, కాలానికి నిలబడిన గొప్ప విషయాలు, వ్యక్తులు, గ్రంధాలు, మతాలు మీద వివాదాస్పదంగా అభిప్రాయాలు పబ్లిక్గా వ్యక్తపరిస్తే గుర్తింపు వస్తుందనేది నిర్వివాదాంశం. ఎందరో అలా రాసి కొంతకాలం గుర్తింపు తెచ్చుకుని తరవాత కనిపించకుండా పోయారు. కొందరు అడపా దడపా మొరిగి అలిసిపోయారు. అందరికీ తెలిసిన ఒక అంశం మీద రాయాలంటే మంచి విషయ పరిజ్ఞాముండాలి. శైలి ఒక్కటే కాదు స్టఫ్ కూడా వుండాలి. ఓ బుక్కు చూసి, నలుగురు కామెంట్ మద్దతుదార్లున్నారు కదా అని, వెంటేసుకుని అపోజిషన్ పార్టీ పోస్టర్ల మీద బురద వేసేంత సులభం కాదు, ఆది కావ్యాలను, కథకులను విమర్శించడం.